Monday, April 29, 2024

National – శంభు సరిహద్దుల్లో బారికేడ్ల ధ్వంసం – డ్రోన్ల నుంచి టియర్ గ్యాస్ ప్ర‌యోగం..

పంజాబ్-హర్యానా (శంభు) సరిహద్దులో గందరగోళం నెల‌కింది. నిరసన తెలిపేందుకు వ‌స్తున్న‌ రైతులు బారికేడ్లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత హర్యానా పోలీసులు గుంపును చెదరగొట్టడానికి టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. అంతకుముందు భారీ భద్రత మధ్య రైతు సంఘాలు ‘డిల్లీ చలో’ మార్చ్‌ను ప్రారంభించాయి. హర్యానా పోలీసులు సరిహద్దులో అనేక మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

రేష‌న్‌, వంట‌సామ‌గ్రి వేలాదిగా త‌ర‌లివ‌స్తున్న పంజాబీ ట్రాక్ట‌ర్లు

పంజాబీ రైతులు ఢిల్లీ దిశ‌గా క‌ద‌లివ‌స్తున్నారు. వేలాది సంఖ్య‌లో ఉన్న ట్రాక్ట‌ర్ల‌లో ఢిల్లీ బాట‌ప‌ట్టారు. గ‌తంలో సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మం సాగించిన రైతు సంఘాలు.. ఇప్పుడు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం కోరుతూ దేశ‌రాజ‌ధానికి వ‌స్తున్నారు. ఛ‌లో ఢిల్లీ మార్చ్ కోసం రైతులంతా ప్రిపేర‌య్యారు. క‌నీసం ఆరు నెల‌ల‌కు స‌రిప‌డా ఉన్న రేష‌న్‌తో ట్రాక్ట‌ర్లు బ‌య‌లుదేరాయి. అంబాలా-శంభూ, క‌నౌరి-జింద్‌, దాబ్‌వాలీ బోర్డ‌ర్ రూట్లో ఆ ట్రాక్ట‌ర్లు ముందుకు వెళ్తున్నాయి.

ప‌తేగ‌ర్ సాహిబ్‌ నుంచి వంద‌ల సంఖ్య‌లో ట్రాక్ట‌ర్లు

మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు పంజాబ్‌లోని ఫ‌తేగ‌ర్ సాహిబ్ నుంచి వంద‌ల సంఖ్య‌లో ట్రాక్ట‌ర్లు బ‌య‌లుదేరాయి. వాళ్లంతా శింబూ బోర్డ‌ర్ రూట్లో వ‌స్తున్నారు. మ‌రో గ్రూపు మేహ‌ల్ క‌ల‌న్ దారిలో క‌న్నౌరి బోర్డ‌ర్ దిశ‌గా వెళ్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ రైతులంతా ఓ కాన్వాయ్‌లా క‌దిలారు. ట్రాక్ట‌ర్ల‌లో యువ‌కులు, మ‌హిళ‌లు, వృద్ధులు ఉన్నారు.

- Advertisement -

హ‌ర్యానా బోర్డ‌ర్‌లో ఫుల్ సెక్యూరిటీ..

పంజాబీ రైతుల‌ను అడ్డుకునేందుకు హ‌ర్యానాలో ఉన్న బోర్డ‌ర్ ప్ర‌దేశాల వ‌ద్ద సెక్యూర్టీ పెంచారు. అంబాలా, జింద్‌, ఫ‌తేహ్‌బాద్‌, కురుక్షేత్ర‌, సిర్‌సా వ‌ద్ద బోర్డ‌ర్ల‌ను సీజ్ చేశారు. కాంక్రీట్ బ్లాకులు, ఐర‌న్ మేకులు, ఇనుపు వైర్ల‌ను ఫిక్స్ చేశారు. హ‌ర్యానాలోని 15 జిల్లాలో 144 సెక్ష‌న కింద ఆంక్ష‌లు విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement