Sunday, May 19, 2024

త‌ల్లి పెయింటింగ్ చూసి కాన్వాయ్ ఆపిన మోడీ – బాలిక‌ని ఆశీర్వ‌దించిన ప్ర‌ధాని

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాజ‌ధాని సిమ్లాలో రోడ్డుకు ఇరువైపులా నిల‌బ‌డిన జ‌నానికి అభివాదం చేస్తూ స్పీడుగా సాగుతున్న మోదీ… ఓ చోట ఉన్న‌ట్టుండి త‌న కాన్వాయ్‌ను ఆపారు. ఆ త‌ర్వాత కారులో నుంచి దిగిన మోడీ.. ఆ జ‌న స‌మూహంలో బారీకేడ్ల‌కు ఆవ‌ల నిలుచున్న ఓ బాలిక వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ బాలిక చేతిలోని పెయింటింగ్‌ను తీసుకున్నారు. బారీకేడ్ల‌కు ఆవ‌త‌ల నిల్చొని మ‌రీ మోడీ కాళ్ల‌కు ఆ బాలిక న‌మ‌స్క‌రిస్తే… మోదీడీ ఆ బాలిక‌ను ఆశీర్వ‌దించారు. ఇంత‌కీ ఆ బాలిక గీసిన పెయింటింగ్ ఎవ‌రిదో తెలుసా.. మోడీ మాతృమూర్తిది. కాన్వాయ్‌లో స్పీడుగా వెళుతున్న మోడీ… త‌న త‌ల్లి పెయింటింగ్ చూడ‌గానే త‌న కాన్వాయ్‌ని నిలిపేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement