Friday, April 19, 2024

సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన నాదెండ్ల మనోహర్

న‌ర్సాపురంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌న‌సేనాపై విమ‌ర్ష‌ల వ‌ర్షం కురిపించారు. జనసేన పార్టీని రౌడీసేన అన్నారు. దీనిపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.
జనసేన ఎందుకు రౌడీసేన? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. మీరు చేస్తున్న అవినీతిని, అన్యాయాల‌ను బ‌య‌ట‌పెడుతున్నందుకా అని ప్ర‌శ్నించారు. మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా? , పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా? జనసేన ఎందుకు రౌడీసేన? అని నాదెండ్ల నిలదీశారు. మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలురైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేస్తున్నందుకా? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుకా? మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా? ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా? జనసేన ఎందుకు రౌడీ సేన జగన్ గారూ!” అంటూ నాదెండ్ల ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement