Saturday, April 27, 2024

Murders With Snake – భ‌ర్తే కాల‌నాగు.. భార్య‌,బిడ్డ‌ను హ‌త‌మార్చిన విష పురుగు

ఒడిశాలో భార్య, బిడ్డ పట్ల భ‌ర్తే కాల‌నాగ‌య్యాడు… ఇంట్లోని గదిలో నిద్రిస్తున్న సమయంలో పామును వదిలి వారిని చాలా తెలివిగా హత్య చేశాడు. గంజాం జిల్లాలోని కబి సూర్యనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అధీగావ్‌ గ్రామానికి చెందిన 25 ఏళ్ల గణేశ్‌ పాత్రాకు బసంతి పాత్రా (23)తో 2020లో వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె దేబాస్మిత ఉంది. అయితే గణేశ్‌ తన భార్య బసంతితో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆమెను అంతమొందించాలని భావించాడు. ఇందుకోసం ఎవరికీ అనుమానం రాకుండా హత్యకు ఓ పాము ను ఆయుధంగా చేసుకున్నాడు.. పాములు పట్టే వ్యక్తి నుంచి విషపూరిత పాము ను కొనుగోలు చేశాడు.. గ‌త రాత్రి రాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్య, కుమార్తె గదిలోకి పామును వదిలాడు . ఆ తర్వాత అతడు వేరే గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లారేసరికి వారిద్దరూ విషం కక్కుకుని చనిపోయి కనిపించారు.

అయితే, వీరి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బసంతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల జోక్యంతో అసలు విషయం బయటపడింది. దర్యాప్తులో భాగంగా గణేశ్‌ తీరుపై అనుమానంతో పోలీసులు అతడిని విచారించారు. తొలుత ఆరోపణలను ఖండించినా పోలీసులు గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టాడు. వారి గదిలోకి తానే పామును వదిలినట్టు అంగీకరించడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement