Saturday, May 18, 2024

Munugode bypoll results : రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తి.. కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు

మునుగోడు ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతంది. నువ్వా నేనా అన్నట్లుగా స్వ‌ల్ప ఓట్ల తేడాతో బీజేపీ, టీఆర్ ఎస్ లు పోటీప‌డుతున్నాయి. దీంతో ప్ర‌జ‌ల్లో న‌రాలు తెగే ఉత్కంఠ మొద‌లైంది. ఎవ‌రు గెలుస్తారా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రాజ‌గోపాల్ రెడ్డి తాను అనుకున్న విధంగా చౌటుప్ప‌ల్ లో మెజారిటీ రాలేద‌ని నిరాశ‌కు గుర‌య్యారు. తనకు పూర్తిగా పట్టున్న చౌటుప్పల్‌ మండలంలో అనుకున్నంతగా ఓట్లు పోలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఓట్లు మాత్రం రాలేదని చెప్పారు. మండల ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గుచూపడంతో నిరాశగా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లారు. అదేవిధంగా చౌటుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీజేపీ అధిక్యంని విజయ వంతంగా అడ్డుకున్నార‌ని రఘునందన్ రావు త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement