Monday, April 29, 2024

IPL 2024 | టాప్ ప్లేయ‌ర్స్‌ని వదులుకున్న ముంబై.. జుగారత్‌ను వీడనున్న పాండ్యా

ఐపీఎల్ 2024 సీజన్ 17కు ఏర్పాట్లు మొదలయ్యాయి. రీసెంట్‌గా వన్డే ప్రపంచకప్ 2023 ముగియగా.. ఇప్పుడు ఫోకస్ అంతా ఐపీఎల్ 2024 వేలంపై పడింది. ఇక ఈ ఐపీఎల్ సీజన్17 వేలం దుబాయ్ వేదికగా వచ్చే నెల (డిసెంబర్) 19న జరగనుంది. కాగా, రేపు (నవంబర్ 26) సాయంత్రం 4 గంటల్లోగా ఐపీఎల్‌లోని అన్నీ ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్ ప్రకటించాల్సి ఉంది. దీంతో ఐపీఎల్ వేలంలో ఎవరు ఉంటారు, ఎవరు కొనసాగుతారనేది క్లారిటీ రానుంది. ఈ క్రమంలో వివిధ ఫ్రాంచైజీల్లో కొన్ని ఊహించని పరిణామాలు జరగనున్నట్టు తెలుస్తొంది.

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఆ జట్టును వదిలి ముంబై ఇండియన్స్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. స్వాపింగ్ ప్రక్రియ ద్వారా ఈ మార్పు జరగనుందని సమాచారం. అదే సమయంలో ముంబై ఇండియన్స్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్‌ను ఆ ఫ్రాంచైజ్ వదులుకోవచ్చు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులో చేరితే రోహిత్ కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడా అనే వార్తలు ప్రస్తుతం వరైల్‌గా మారాయి.

- Advertisement -

అదేవిధంగా.. పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ఫ్రాంచైజీ ఈసారి శామ్ కుర్రెన్, ధావన్‌ను వదులుకోనుంది. చెన్నై నుంచి బెన్ స్టోక్స్ ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. 13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ వదులుకుంటుంది. ఇక కేకేఆర్ జట్టు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌లను వదులుకోనుంది. డిల్లీ ఫ్రాంజైజీ అయితే మనీష్ పాండే, పృధ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, నాగర్కోటిలను వదులుకోనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన ఆవేశ్ ఖాన్ స్వాపింగ్ ప్రక్రియలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చేరవచ్చు.

ఇదంతా ఓ ఎత్తైతే వన్డే ప్రపంచకప్ 2023లో సంచలనాలు నమోదు చేసిన కీలక ఆటగాళ్లు ముగ్గురిపై అన్ని ఫ్రాంచైజీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఆస్ట్రేలియాకు కప్ అందించడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్‌పైనే ఐపీఎల్ 2024 వేలంలో అన్ని ఫ్రాంచైజీలు దృష్టి సారిస్తున్నాయి. అదే విధంగా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌లకు భారీ డిమాండ్ ఉండవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement