Sunday, April 28, 2024

WPL | గుజరాత్‌పై ముంబై ఈజీ విక్టరీ..!

డ‌బ్ల్యూపీఎల్ రెండవ సీజన్‌లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ మ‌రో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన గుజరాత్‌ జెయింట్స్ మొద‌ట బ్యాటింగ్ చేసి టార్గెట్ సెట్ చేయడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై 5 వికెట్లతో గెలుపొందింది.

ఇక చేజింగ్‌లో ముంబై కప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( నాటౌట్) 46 పరుగులతో చెలరేగింది. ఇక నాట్ స్కివర్-బ్రంట్ (22) , అమేలియా కెర్ (31) పరుగలతో పరువాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో తనూజా కన్వర్ రెండు వికెట్లు తీయగా.. కాథరిన్ బ్రైస్, లీ తహుహు చరో వికెట్ దక్కించుకున్నారు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాట్లలో తనూజా కన్వర్‌ (28) టాప్‌ స్కోరర్‌ కాగా.. కత్రిన్‌ బ్రైస్‌ (25 నాటౌట్), బెత్‌ మూనీ (24) లు ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ నాలుగు, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ మూడు వికెట్లతో రాణించారు. ఇక హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్ చరో వికెట్ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement