Friday, May 10, 2024

హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు


ఎప్పుడూ ఏదో ఒక సంఘటనపై వ్యాఖ్యలు చేస్తూ.. త‌న‌దైన శైలిలో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఇవాళ తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ దుర్ఘటనపై స్పందించారు. నిన్న కుప్ప‌కూలిన‌ హెలికాప్టర్ ప్రమాదంపై రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘటనపై సుప్రీం కోర్ట్ రిటైర్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరణించారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్యతో పాటు 11మంది ఇతరులు మరణించిన‌ సంఘటన షాకింగ్ అన్నారు. దేశ భద్రతకు పెద్ద హెచ్చరిక అని సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. ఫైనల్ రిపోర్టు రాలేదు కాబట్టి ఏదైనా చెప్పడం చాలా కష్టమ‌ని, కానీ వాస్తవం ఏమిటంటే తమిళనాడు లాంటి సేఫ్ జోన్‌లో ఉన్న మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ పేల్చివేయబడినట్లు కనిపిస్తోందని సుబ్ర‌మ‌ణ్య‌ స్వామి అన్నారు.
అయితే దేశ తొలి సీడీసీ బిపిన్ రావత్ మరణం యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. భారత దేశ భద్రత కోసం మిలటరీని మరింత పటిష్టం చేస్తున్న క్రమంలో బిపిన్ రావత్ మరణించడం సైన్యంతో పాటు భారత దేశానికి భారీ దెబ్బగా రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇవాళ‌ బిపిన్ రావత్, ఆయన సతీమణి పార్థీవ దేహాలు తమిళనాడు నుంచి ఢిల్లీకి తరలించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement