Monday, May 6, 2024

బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిరండి.. కంపెనీలకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బెంగుళూరులో ట్రాఫిక్‌, పవర్‌ కట్‌ సమస్యలు పెరిగినందున అక్కడి కంపెనీలు హైదరాబాద్‌కు తరలిరావాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ విషయమై గురువారం ట్విట్టర్‌లో ఆయన స్పందించారు. హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ 3(ఐ) అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. ఇక్కడి వాతావరణం కూడా వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు అత్యుత్తమైనదని సిలికాన్‌ పెట్టుబడుదారులకు మంత్రి కేటీఆర్‌ వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement