Tuesday, April 30, 2024

బిఆర్ఎస్ తోనే ప్రజలకు మరింత భరోసా.. పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు : మల్లారెడ్డి

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : భారాసపార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి కేసీఅర్ చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పధకలకు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఆకర్షితులై ఇతర పార్టీ నాయకులు పార్టీలో చేరుతున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు భారాసలో చేరుతున్నారు. ముడుచింతలపల్లి మండలం బీజేపీ పార్టీ నాయకులు చంద్రకాంత్ రెడ్డి, నందు, సాయి కిరణ్, మేడ్చల్, శామీర్పేట్ మండలాల నుండి అక్షయ్, ఆదికేశవ్ రెడ్డి, బాలు రెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రజ్వల్, బీజేపీ కాంగ్రెస్ పార్టీ యువకులు దాదాపు 100మంది పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు బిఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రతి ఒక్క కార్యకర్త కు బిఆర్ఎస్ పార్టీ జెండానే శ్రీరామరక్ష అని అన్నారు, శ్రమించి పని చేసే ప్రతి కార్యకర్త కి తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ వైపు పరుగులు పెడుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, ఎంపీపీలు ఎల్లుబాయ్ బాబు,హారిక మురళి గౌడ్,జడ్పీటీసీ అనిత, తుంకుంట మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,కౌన్సిలర్లు,స్థానిక ఎంపీటీసీలు, సర్పంచ్లు, కో అప్షన్ సభ్యులు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి,చంద్ర శేఖర్ యాదవ్,మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్, మల్లేష్ గౌడ్, దయానంద్ యాదవ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement