Monday, April 29, 2024

PM MODI: ఇదో అత్యంతఆధునిక నిర్మాణం.. డైమండ్‌ బోర్స్‌ను ప్రారంభం

సూరత్‌లో నిర్మించిన డైమండ్‌ బోర్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. డైమండ్‌ బోర్స్‌.. ఇదో అత్యంత ఆధునిక నిర్మాణం. 36 ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఒకేసారి 67వేల మంది కంఫర్ట్‌బుల్‌గా కార్యకలాపాలు చేసుకునేలా ఈ భవన నిర్మాణం జరిగింది. 4500పైగా వివిధ కార్యాలయాలున్న ఈ భవనంలో 131 హైస్పీడ్‌ లిఫ్ట్‌లు ఉన్నాయ్‌. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌కనెక్టెడ్‌ భవనంగా రికార్డ్‌ సృష్టించింది.

డైమండ్‌ బోర్స్‌ సెంటర్‌తో వజ్రాల పరిశ్రమకు మరింత ఊపు వస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. గత 80ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా ఉన్న అమెరికా పెంటగాన్‌ను.. సూరత్‌ డైమండ్‌ బోర్స్‌ అధిగమించిందన్నారు.వారణాసిలోని కటింగ్ మెమోరియల్ స్కూల్ గ్రౌండ్స్‌లో విక్షిత్ భారత్ సంకల్ప యాత్రలో మోదీ పాల్గొంటారు. ఈ క్రమంలో ప్రధాని ఆవాస్, పీఎం స్వానిధి, పీఎం ఉజ్వల వంటి వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషించనున్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దార్శనికతకు అనుగుణంగా ప్రధాన మంత్రి నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం 2023ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కన్యాకుమారి-వారణాసి తమిళ సంగమం రైలును కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక సోమవారం ఉదయం 10:45 గంటలకు ప్రధానమంత్రి స్వర్వేద్ మహామందిర్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత ఉదయం 11:30 గంటలకు బహిరంగ కార్యక్రమంలో ప్రారంభోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటలకు ప్రధాని మోదీ విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో, మధ్యాహ్నం 2:15 గంటలకు రూ.19,150 కోట్లు విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement