Thursday, April 25, 2024

గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్‌

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత కౌంటర్ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై.. సీఎం కేసీఆర్‌ పై చేసిన వ్యాఖ్యలకు కవిత ట్వీటర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే ఊరుకునేది లేద‌న్నారు. కరోనా లాంటి విప‌త్తు స‌మ‌యంలో సెంట్రల్ విస్టా మీద కంటే, దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింద‌ని, కేంద్రం మాత్రం కేవలం కొందరి సంపద పెంపుపై మాత్ర‌మే దృష్టి పెట్ట‌కుండా… రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నామ‌న్నారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు అని క‌విత త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement