Friday, May 3, 2024

గణేష్ నిమజ్జనం వాహనాలను ప్రారంభించిన మంత్రి తలసాని

కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ క్రింద ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన గణేష్ నిమజ్జనానికి మూడు వాహనాలను TS ఫుడ్ చైర్మన్ రాజీవ్ సాగర్ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా 6 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మొట్టమొదటి సారిగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనం వాహనాలను నగరంలో ప్రారంభించడం పట్ల నిర్వాహకులను మంత్రి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement