Monday, May 6, 2024

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో కుంచె పట్టి రంగులు వేసిన మంత్రి పువ్వాడ

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని పలు పనులను ప్రారంభించారు. 58వ డివిజన్ వివేకానంద కాలనీ నందు పిల్చే యంత్రం ద్వారా మురుగును తొలగించే పనులను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా డివిజన్ లో మొక్కలు నాటారు. 55వ డివిజన్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రధాన కాల్వ పూడిక పనులు ప్రారంభించారు. అనంతరం డివిజన్ లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్ తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాల్వలు పరిశీలించి మురుగు పేరుకుపోయిన ప్రాంతాలను తక్షణే శుభ్రం చేయాలని అదేశించారు. 6వ డివిజన్ ఖానాపురం ప్రధాన రహదారిపై గల డివైడర్ పెయింటింగ్, వాల్ పెయింటింగ్, ఖాళీ స్థలాలు శుభ్రం చేసే పనులను ప్రారంభించారు. డివైడర్ కు స్వయంగా కాసేపు మేయర్ నీరజ తో కలిసి రంగులు వేశారు. అనంతరం సెంటర్లో పేరుకుపోయిన చెత్తా చెదారం ను తొలగించి.. ప్రభుత్వ స్థలాల గోడలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీ గోడలకు రంగులు వేశారు. మేయర్ పునుకొల్లు నీరజ , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి , అసిస్టెంట్ కమిషనర్ మల్లేశ్వరి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్ , డీఈ రంగారావు , విద్యుత్ డీఈ రమేష్ , కార్పొరేటర్లు దోరెపల్లి శ్వేత , మోతారపు శ్రావణి , నాగండ్ల కోటి , అధికారులు సిబ్బంది పాల్గొన్నరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement