Friday, May 17, 2024

మంత్రి మేకపాటికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌ లో ఉంటూ వైద్యం అందుకుంటున్నారు. మంత్రి మేకపాటి త్వరగా కోలుకోవాలని వైసీపీ నేతలు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. మంత్రి మేకపాటికి కరోనా సోకడంతో నెల్లూరు జిల్లాలో నిర్వహించిన కరోనా సమీక్షకు మంత్రి అనిల్ కుమార్ ఒక్కరే హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement