Tuesday, April 30, 2024

HYD: బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి బోడుప్పల్ పర్యటనలో ఉన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో కాసేపటి క్రితం మంత్రి మల్లారెడ్డి బస్తీ దవాఖానను ప్రారంభించారు. అనంతరం మంత్రి బస్తీ దవాఖాన వైద్యులతో బీపీ చెక్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బొమ్మకు కళ్యాణ్ కుమార్ తోపాటు మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement