Thursday, April 25, 2024

నేతాజీకి మంత్రి గంగుల నివాళి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆదర్శ్ నగర్ లో నేతాజీ విగ్రహానికి రాష్ట్ర బీసీ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవెని మధు,కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, కార్పొరేటర్లు గంట కల్యాణి, కుర్ర తిరుపతి గందే మాధవి, అర్ష కిరణ్మయి,ఆర్ష మల్లేశం, నాయకులు మెచినేని అశోక్, కోల సంపత్, గంట శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement