Friday, May 3, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగుల కమలాకర్‌

తిరుమల శ్రీవారిని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, బాస్కర్ రావులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. కరీంనగర్ పద్మనగర్ లో 10 ఎకరాల స్థలం లో నిర్మించే వెంకటేశ్వర ఆలయ భూమి పూజకు రావాల్సిందిగా టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జెఈఓ ధర్మారావులను మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఆహ్వానించారు.. ఈ సందర్భంగా ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో నిర్మించే అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్టు, పోటు, ప్రసాధ వితరణ కేంద్రం, తదితర అన్ని అంశాలను పరిశీలించారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు బోయిని పల్లి వినోద్ కుమార్, తెలంగాణ టీటీడీ బోర్డు అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కర్ రావు, దొంత రమేష్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement