Friday, May 3, 2024

గెలుపు కంటే మెజారిటీ ముఖ్యం..ఆళ్ల నాని..

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ నెల 15వ తేదీన జరగనున్న ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో 20కి ,20వార్డులను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోబోతోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ..వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల అన్నారు.ఆకివీడు ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంట ఉన్నారని పేర్కొన్నారు.. ఈ ఎన్నికల్లో గెలుపు కన్నా మెజార్టీ ముఖ్యమని, 2024 ఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేయాలన్నా వెన్నులో వణుకు పుట్టేలా మెజార్టీని తీసుకురావడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మంత్రి సూచించారు. ఆకివీడులో ఎన్నికలకు సంబంధించి పార్టీ ముఖ్యనేతలతో అభ్యర్థిల గెలుపు, అభ్యర్థుల మెజార్టీ పై సమీక్షించారు.ఈ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ నరసింహారాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, వైసిపి ఉండి ఇంచార్జ్ గోకరాజు రామరాజు, ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ యోగేంద్ర బాబు పాల్గొన్నారు.

మొదటి సారిగా ఆకివీడు నగర పంచాయతీకి జరుగుతున్న ఎన్నికల్లో వైస్సార్సీపీ జండా ఎగురు వేయడానికి పార్టీ శ్రేణులు అందరూ సైనికులా పని చేయాలని సూచించిన మంత్రి ఆళ్ల నాని..
సీఎం అమలు చేస్తున్న పథకాలే మనకు శ్రీరామరక్ష లాగా ప్రజలు ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పారు.ముఖ్యమంత్రికి ప్రజల్లో పెరుగుతున్న జనఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షం కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు అని అన్నారు. ఆకివీడు ప్రజలు విజ్ఞనులు – అభివృద్ధికై ఓటు వేస్తారు, జగనన్న ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు నవరత్నాల సంక్షేమ పధకాలు అందుతున్నాయి అని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలు, ప్రజలకు వివరించి ఓట్లు అడిగే హక్కు ఒక్క వైస్సార్సీపీకే ఉంది అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement