Wednesday, May 1, 2024

Mini Van స్కూటీపై ఎనిమిది మంది… వాహ‌న‌దారుడు అరెస్ట్

ముంబై -ఒక ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించేందుకు చట్ట పరంగా అనుమతి లేదు. ఇద్దరు కూడా విధిగా హెల్మెట్లు ధరించాలని చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ముంబైకి చెందిన ఓ వ్యక్తి తనకు నిబంధనలు ఏవీ వర్తించవన్నట్టు వ్యవహరించాడు. తన స్కూటర్ పై ఏకంగా ఏడుగురు పిల్లలను ఎక్కించుకుని స్కూల్ కు తీసుకెళ్లాడు. ఇది కెమెరాలకు చిక్కి సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో వైరల్ గా మారింది.

ఈ వీడియో ఆధారంగా మునావర్ షాగా గుర్తించి అత‌డిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు పోలీసులు. స్కూటర్ ను సీజ్ చేశారు. స్కూటర్ పై అంతమంది ఎలా పట్టారన్న సందేహం రావచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. సీటు వెనుక ముగ్గురు కూర్చున్నారు. మరో ఇద్దరు స్కూటర్ వెనుక, పక్కన క్రాష్ గార్డ్ పై నించున్నారు. రైడర్ తనతోపాటు స్కూటర్ పై ఉన్న మిగిలిన అందరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశాడని, దీన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తున్నట్టు ముంబై పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement