Monday, April 29, 2024

Delhi: మెట్రో స్టేషన్‌ వాల్ కూలి… పలువురికి గాయాలు!

ఢిల్లీలోని గోకల్‌పురి మెట్రో స్టేషన్‌ వాల్‌లోని కొంత భాగం కుప్పకూలడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. గురువారం గోకల్‌పురి మెట్రో స్టేషన్‌లోని సైడ్ వాల్‌లోని కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో, అక్కడున్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ స్లాబ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని శిథిలాల నుండి బయటకు తీసుకువచ్చి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

గోకల్‌పురి మెట్రో స్టేషన్ ప్రమాదం గురించి ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ… గురువారం 11గంటల సమయంలో గోకల్‌పురి మెట్రో స్టేషన్ సరిహద్దు గోడ (తూర్పు వైపు) కూలిపోయి దిగువ రహదారిపై పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జేసీబీ, క్రేన్‌ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement