Saturday, May 18, 2024

మెగాస్టార్ 154 మూవీ.. హీరోయిన్‌కు వెల్‌క‌మ్ చెప్పిన చిరు..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ను లైన్‌లో పెట్టి ఫుల్ బిజీ ఉన్న‌ సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆయ‌న న‌టించిన సినిమా ఆచార్య విడుద‌లకు రెడీ అయింది. మ‌రోవైపు వేదాళ‌మ్ రీమేక్ భోళా శంక‌ర్‌, లూసిఫ‌ర్ రీమేక్ గాడ్ ఫాద‌ర్ సెట్స్ పై ఉన్నాయి. వీటితోపాటు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో 154వ ప్రాజెక్టును కూడా చేయబోతున్నాడు చిరు. ఇవాళ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా చిరు టీం హీరోయిన్ ఎవ‌ర‌నేది ప్ర‌క‌టించింది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాస‌న్ ను క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు చిరంజీవి తెలియ‌జేశాడు.

మా టీంలోకి స్వాగ‌తం అంటూ శృతిహాస‌న్‌కు బొకేను అందిస్తున్న ఫొటోను ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు చిరు. శృతిహాస‌న్-చిరంజీవి కాంబినేష‌న్ తొలిసారి కావ‌డంతో మూవీ ల‌వ‌ర్స్ చాలా ఎక్జ‌యిటింగ్ ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా క‌మ‌ర్షియ‌ల్ హంగుల మేళ‌వింపుతో రాబోతున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిచ‌నున్నాడు.

క్రాక్ సినిమా స‌క్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న శృతిహాస‌న్ ఆ త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని, బాల‌కృష్ణ కాంబోలో వ‌స్తున్న సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు స‌లార్‌లోనూ ప్ర‌భాస్‌తో క‌లిసి రొమాన్స్ చేయ‌నుంది శృతి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement