కంటోన్మెంట్, (ప్రభన్యూస్): హైదరాబాద్లోని న్యూబోయిన్పల్లిలో రేపు మెగా జాబ్మేళా జరగనుంది. ఈ జాబ్మేళాలో ఐటీ, బ్యాంకింగ్ కంపెనీలతో పాటు ఫార్మసీ, లాజిస్టిక్ రంగాలకు చెందిన వారు ఉద్యోగ ఎంపికలు చేయనున్నారు. కాగా, సింగపూర్ పాండురంగారెడ్డి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేది ఆదివారం జయానగర్ కాలనీలోని సేయింట్పీటర్స్ గ్రామర్ పాఠశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ రణదీర్రెడ్డి తెలిపారు.
ఈ మెగా జాబ్ మేళాలో ఐటి కంపనీలతో పాటు బ్యాంకింగ్ జాబ్స్, లాజిస్టిక్స్, ఫార్మసి, హోటల్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, టీచర్స్, తదితర ఉ ధ్యోగాల నియామకాలు జరుగుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఈ క్రింది ఫో న్నంబర్లు 9014964496, 9959184958, 6301165035లను సంప్రదించగలరు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.