Wednesday, May 15, 2024

Mandyapradesh – డంపర్‌ తో ప్రైవేటు బస్సు ఢీ – 13 మంది సజీవదహనం

మధ్యప్రదేశ్ – గుణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుణ-ఆరోన్‌ రహదారిపై ఎదురుగా వస్తున్న డంపర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే ప్రయాణికులు మంచి నిద్రలో ఉండటంతో 13 మంది సజీవదహనమయ్యారు.

మరో 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.

ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని చెప్పారు గుణ జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ.. ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను తొలగించామని, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

బస్సు ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు సహాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement