Friday, May 3, 2024

చిన్నారిపై అత్యాచారం, హత్య.. చూసి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

గుజరాత్‌లోని నరోలిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కిరాతకుడు నాలుగేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి ఆపై హత్య చేయడం కలకలం రేపింది. ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లిన తమ బిడ్డ కనిపించడంలేదని పోలీసులకు చిన్నారి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నరోలి గ్రామ సొసైటీలోని ఓ అపార్టుమెంట్ టాయ్‌లెట్ పైప్ పక్కనే ఉన్న ఓ బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సొసైటీలోని 40 ఫ్లాట్లలో వారు తనిఖీలు చేయగా 109వ ఫ్లాట్‌లో రక్తపు మరకలు కనిపించడం.. బాత్‌రూం కిటికీ అద్దాలు పగిలి కనిపించడంతో అందులో నివసిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాపను అత్యాచారం చేసి చంపినట్లు నిందితుడు సంతోష్ రజత్ అంగీకరించాడు. హత్య చేసిన తర్వాత పాప మృతదేహాన్ని బ్యాగులో పెట్టి బాత్‌రూం కిటికీ నుంచి బయటకు విసిరినట్లు విచారణలో వెల్లడించాడు. కాగా ఈ దారుణాన్ని తట్టుకోలేక చిన్నారి తండ్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement