Saturday, April 20, 2024

కేజిఎఫ్ యూనిట్ గ్రూప్ పిక్ చూశారా ?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు హీరో యశ్. ప్రస్తుతం కేజిఎఫ్ కు సీక్వెల్ గా కేజిఎఫ్ 2 తెరకెక్కుతోంది. అయితే కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడటంతో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇక ఇప్పటికే యశ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ రికార్డులను నెలకొల్పింది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ జర్నీ గుర్తుచేసుకుంటూ కేజిఎఫ్ యూనిట్ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో హీరోయిన్స్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా కనిపించారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. జూలై 16న ఈ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

https://twitter.com/prashanth_neel/status/1370664678288805890?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement