Friday, May 10, 2024

Malaysia Open 2024 | సెమీస్‌లోకి భార‌త జోడీ..

మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న “మలేషియా ఓపెన్ సూపర్ 1000” టోర్నీలో భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో చైనాకు చెందిన హీ జీ టింగ్‌-రెన్‌ జియాంగ్‌ యు ద్వయం పై 21-11, 21-8తో వరుస గేమ్‌లలో గెలిచి రెండో సెమీఫైనల్‌కు చేరుకున్నారు.

ఇక సెమీస్ లో భారత ద్వయం కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్-సియో సెంగ్ జే లేదా మూడో సీడ్ మలేషియా జోడీ ఆరోన్ చియా-సోహ్ వూయ్ యిక్‌తో తలపడనుంది.

ఇదిలావుండగా, మలేషియా ఓపెన్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో క్వార్టర్ ఫైనల్లో ఆర్ ఇవానాగా-కె నకనిషి చేతిలో 21-15, 21-13 తేడాతో ఓడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement