Saturday, May 18, 2024

ప్రధాని మోదీకి కౌంటరిచ్చిన ఎంపీ..

బెంగాల్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రధాని మోదీకి కౌంటరిచ్చారు టీఎమ్ సీ లీడర్ మహువా మొయిత్రా. ప్రచారం సభలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ‘దీదీ ఓ దీదీ’ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో మోదీకి కౌంటరిచ్చారు ఎంపీ మహువా మొయిత్రా వీధి జులాయి అంటూ ఘాటుగా విమర్శించారు. మేం బెంగాల్ లోనే ఉంటాం..గోడ మీద కూర్చుని వచ్చిపోయే ఆడవాళ్లను ‘దీదీ ఏ దీదీ’ అంటూ టీజ్ చేసే వీధి జులాయిల మోదీ మాట్లాడతున్నారని వ్యాఖ్యనించారు. ఓ సిట్టింగ్ ముఖ్యమంత్రి గురించి ఇలాగేనా మాట్లాడేది? వాళ్ల అమ్మ గురించి అలాంటి కామెంట్లే చేస్తారా? ఇవేనా ప్రధాని వచ్చి మాకు చెప్పే నీతులు? పద్ధతి గురించి మాకు చెబుతారా? ఓ ముఖ్యమంత్రి గురించి ప్రధాని ఇంత నీచంగా ఎలా మాట్లాడగలరు?’’ అంటూ ఆమె మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement