Monday, April 29, 2024

Madya Pradesh – బ్రిడ్జిపై నుంచి న‌దిలో ప‌డ్డ పెళ్లి బృందం ట్ర‌క్కు – అయిదుగురు దుర్మ‌ర‌ణం

మధ్యప్రదేశ్ దతియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న మినీ ట్రక్కు బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 30మందికి గాయాలయ్యాయి. ప్రమాదం తరువాత ట్రక్కులో ప్రయాణిస్తున్న పిల్లలు కొందరు తప్పిపోయారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులు గ్వాలియర్‌లోని బిల్హేటి గ్రామ నివాసితులు. వారు తమ వధువు తరపున వివాహంకోసం తికమ్‌ఘర్‌ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు బుహ్రా నదిలో పడిపోయింది.

మరోవైపు బుహ్రా నదిలో ట్రక్కు పడిపోయిన సమాచారం అందిన వెంటనే గ్రామస్తులు ట్రక్కులోని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. జిల్లా యంత్రాంగం, పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో పడినవారిలో కొందరు చిన్నారులు కనిపించకుండా పోయారు. వారికోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 30 మందికి గాయాల‌య్యాయి.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement