Wednesday, May 1, 2024

ప్రియుడిని 30 ముక్క‌లు చేసి……30 చోట్ల పాతిపెట్టిన ప్రియురాలు..

చెన్నై – తమిళనాడు రాజధాని చెన్నైలో ఢిల్లీ శ్రద్దావాకర్ హత్య కేసు తరహాలోనే ఒక హ‌త్య జ‌రిగింది.. అయితే ఈ హ‌త్య ప్రియురాలు చేయ‌డం విశేషం.. వివ‌రాల‌లోకి వెళితే చెన్నైకు చెందిన జ‌య‌ల‌క్ష్మీ త‌న ప్రియుడు జ‌యంత‌న్ మోసం చేయ‌డంతో అత‌డిని దార‌ణంగా హ‌త‌మార్చింది. అంతే కాకుండా 400 కిలోమీటర్ల ప‌రిదిలో 30 మృతదేహం ముక్కలు చేసి పాతిపెట్టింది. చెన్నై శివార్ల‌లో జ‌యంత్ మృత దేహంలోని ఒక కండం వెలుగు చూడ‌టంతో పోలీసులు ద‌ర్యాప్తు చేసి జ‌య‌ల‌క్ష్మీ హ‌త్య చేసిన‌ట్లు తేల్చారు.. మృతుడు ఎం.జయంతన్‌గా గుర్తించారు. 29 ఏళ్ల జయంతన్ చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో థాయ్ ఎయిర్‌వేస్‌లో గ్రౌండ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. మార్చి 18న స్వగ్రామం విల్లుపురం వెళ్లిన జయంతన్ తిరిగి రాకపోవడంతో ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని సోదరి ఫిర్యాదు చేసింది. దీంతో జయంతన్‌ సోదరి ఇచ్చిన ఆధారాలతో కేసును పోలీసులు చేధించారు.
కేసు దర్యాప్తులో భాగంగా జయంతన్ సోదరి ఇచ్చిన ఆధారాలతో కేసు నమోదు చేశారు. ఈ మిస్సింగ్ కేసును మర్డర్ మిస్టరీగా పరిగణించారు. మృత‌దేహం బ‌య‌ట‌ప‌డ‌టంతో జయంతన్ హంతకుడు మరెవరో కాదని, అది అతని మాజీ ప్రియురాలు భాగ్యలక్ష్మి అని నిర్ధారించి, ఆమెను అరెస్టు చేశారు. ఈ హత్యలో ఆమెకు సహకరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మార్చి 20న జయంతన్ కాళ్లు, చేతుల్ని నరికి ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో తీసుకెళ్ళి చెన్నై సమీపంలోని కోవలం దగ్గర నిర్మాణుష్య ప్రదేశంలో ఖననం చేసినట్లు పోలీసులు గుర్తించారు. జయంతన్‌ మొండెం, ఇతర శరీర భాగాల్ని భాగ్యలక్ష్మి బ్యాగులో పెట్టుకొని మార్చి 26న చెన్నైతో పాటు త‌మిళ‌నాడులోని వేర్వేరు ప్రాంతాల‌లో వాటిని పాతిపెట్టినట్లుగా విచారణలో వెల్లడయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement