Saturday, May 18, 2024

రెండుగా చీలిన లోహిత్‌ ఎక్స్‌ప్రెస్‌

బీహార్‌లోని కటిహార్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. గువాహటి నుంచి జమ్మూకు వెళ్లే లోహిత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది.

ఇంజిను నుంచి సుమారు 10 బోగీలు విడిపోగా.. మిగిలిన రైలు మాత్రం కొంతదూరం అలాగే పరుగులు తీసింది. బిహార్‌ – బెంగాల్‌ సరిహద్దులోని నార్త్‌ దినాజ్‌పుర్‌ జిల్లాలో ఉన్న దల్ఖోలా స్టేషను సమీపంలో ఈ ఘటన జరిగింది. చాలామంది ప్రయాణికులు ప్రాణభయంతో కిందికి దూకేశారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను కాసేపు నిలిపివేసి, రెండు భాగాలను జతచేశాక రైలు మళ్లీ బయలుదేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement