Monday, May 6, 2024

రాష్ట్రంలో అంధ‌త్వ నివార‌ణ ల‌క్ష్యంగా ‘కంటి వెలుగు’ : మంత్రి ఎర్ర‌బెల్లి

రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా చేపట్టిన కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగిన వరంగల్, హనుమకొండ జిల్లాల సన్నద్ధత సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కంటి వెలుగును విజయవంతం చేయాలన్నారు. గ్రామాల్లో కంటివెలుగును విజయవంతం చేయాల్సిన బాధ్యత సర్పంచ్‌, కార్యదర్శిదేనని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement