Monday, May 20, 2024

National : సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం… మోదీ ట్వీట్‌

మేడారం మహాజాతర సందర్బంగా ప్రధాని మోదీ ట్వీట్ చేసి భక్తులను ఆకట్టుకున్నారు. తెలంగాణలో అతి పెద్ద మహా కుంభవేళ గా భావించే మేడారం జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది ఈరోజు నుండి ఈ మహాజాతర మొదలైంది.

ఈ సందర్భాంగా ప్రధాని మోదీ తెలుగు లో ఈ మహాజాతర గురించి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం’ అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement