Sunday, April 28, 2024

SSMB28 పై లెటెస్ట్ అప్‌డేట్.. హైదరాబాద్‌లో భారీ సెట్ వేసిన మేకర్స్

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడవ ప్రాజెక్ట్ SSMB28. ఇక ఈ మూవీ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమాలో మహేష్ బాబుకు జొడీగా పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలు కనిపించనున్నారు. తాజా అప్డేట్ ప్రాకారం, ఈ సినిమా నెక్ట్ షెడ్యూల్ రేపు హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. దీనికోసం భారీ సెట్‌ కూడా ఏర్పాటు చేసినట్టు సినీ వర్గాల సమాచారం.

రేపు షూట్ చేయనున్న షెడ్యూల్ లో మహేష్ బాబుతో పాటు ఇద్దరు హీరోయిన్లు కూడా సెట్స్‌పైకి చేరనున్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ నటీనటులు సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. థమన్ ఎస్ ఈ మూవీకి సంగీత దర్శకుడుకి పనిచేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement