Wednesday, April 24, 2024

కర్నూలు జిల్లాలో పిడకల సమరం.. 22 మందికి గాయాలు

కర్నూలు జిల్లా కైరుప్పలలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉగాది మరుసటి రోజైన బుధవారం అనాదిగా వస్తున్న పిడకల సమరాన్ని గ్రామస్థులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో దాడిచేసుకున్నారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఈ పిడకల సమరంలో 22 మంది స్వల్పంగా గాయపడ్డారు. మరోవైపు ఉగాది ఉత్సవాల్లో భాగంగా బుధవారం కర్నూలులోని కల్లూరు చౌడేశ్వరీ దేవి ఆలయం చుట్టూ గాడిదలు, ఎడ్లబండ్లతో ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement