Monday, April 29, 2024

కృష్ణయ్య హత్యకేసులో.. లొంగిపోయిన కోటేశ్వరరావు

గత నెల 15వ తేదీన‌ టీఆర్‌ఎస్‌ నేత కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో మరో ఇద్దరు నిందితులు లొంగిపోయారు. కృష్ణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వర రావు ఈరోజు ఉదయం ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. ఆయనతోపాటు మరో నిందితుడు ఏ10 నాగయ్య కూడా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యానంతరం ఏ9 గా ఉన్న తమ్మినేని కృష్ణయ్య కోటేశ్వర రావు, ఏ10 నాగయ్య పరారీలో ఉన్నారు. తాజాగా వారు కోర్టులో లోంగిపోయారు. ఖ‌మ్మం కోర్టులో లొంగిపోయిన కోటేశ్వ‌ర‌రావుకు జ‌డ్జి 14రోజుల రిమాండ్ విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement