Saturday, July 27, 2024

రింకీ పాంటింగ్‌ను దాటేసిన కోహ్లీ

విరాట్‌ కోహ్లీ వన్డేల్లో 44వ శతకం నమోదు చేశాడు. బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ 113 పరుగులు చేసి నిష్క్రమించాడు. కేవలం 85 బంతుల్లోనే కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. రెండో వికెట్‌కు కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌ మధ్య భాగస్వామ్యం ఏర్పడింది. ఆ ఇద్దరూ 290 పరుగులు జోడించారు.

తొలి రెండు వన్డేల్లో పెద్దగా రాణించలేకపోయిన కోహ్లీ ఇవాళ తన బ్యాట్‌కు పనిపెట్టాడు. తాజా ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచరీల సంఖ్య 72కు చేరుకుంది. రెండోస్థానంలో ఉన్న రింకీ పాంటింగ్‌ను కోహ్లీ దాటేశాడు. తొలి స్థానంలో సచిన్‌ టెండూల్కర్‌ ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement