Friday, May 3, 2024

బరిలో కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌, సైనీ.. వెస్టిండీస్ తో మ్యాచ్ కి ప్రాక్టీస్‌ షురూ.!

వెస్టిండీస్‌తో రెండో వన్డే ముందు వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పేసర్‌ నవదీస్‌ సైనీ అహ్మదాబాద్‌లోని భారత శిబిరంలో చేరారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. సోమవారం భారత శిబిరంలో రాహుల్‌, మయాంక్‌, సైనీ చేరారని బీసీసీఐ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. నెట్స్‌లో వారు ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను అభిమానులకు బీసీసీఐ షేర్‌ చేసింది. ముగ్గురూ ప్రాక్టీస్‌ సెషన్‌లో చెమటోడ్చారని క్యాప్షన్‌ ఇచ్చింది.

కరోనా బారినపడిన నవదీప్‌ సైనీ కోలకుని తిరిగి నెట్స్‌లో బౌలింగ్‌ ప్రారంభించాడు. బుధవారం భారత్‌-విండీస్‌ మధ్య రెండో వన్డే జరగనుంది. వ్యక్తిగత కారణాలతో రాహుల్‌ తొలి వన్డేకు దూరమయ్యాడు. జట్టులో ధావన్‌, రుతురాజ్‌, సైనీ తదితరులు కరోనా బారిన పడటంతో మయాంక్‌కు వన్డేజట్టుకు ఎంపికయ్యాడు. మూడు రోజుల క్వారంటైన్‌ ముగియటంతో మయాంక్‌ జట్టులో కలిశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement