Saturday, April 20, 2024

Corona: భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

భారత్ లో కరోనా కేసులు ఒక్క సారిగా తగ్గిపోయాయి. నిన్న లక్షలోపు కేసులు నమోదు కాగా.. నేడు ఆ సంఖ్య మరింత తగ్గింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 67,597 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కోవిడ్ మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 1188 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,04,062కి పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 9,94,891 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,23,39,611 కు చేరింది. ఇందులో 4,08,40,658 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,70,21,72,615 కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement