Wednesday, May 1, 2024

మోడీ విజ‌న్ లో భాగ‌మే శాఖ మార్పు – కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు..

న్యూఢిల్లీ – న్యాయ శాఖ నుంచి కొత్త శాఖకు తనను మార్చడం అన్నది శిక్ష విధించడం కాదన్నారు. ప్రభుత్వం ప్రణాళిక మేరకే ఇది చేసినట్టు కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు.. చెప్పారు. ‘‘ప్రతిపక్షం నన్ను తప్పకుండా విమర్శిస్తుంది. నాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మాట్లాడడం కొత్తేమీ కాదు. నన్ను మార్చడం అన్నది శిక్షించడం కాదు. ఇది ప్రభుత్వ ప్రణాళిక. ప్రధాని మోడీ దార్శనికత’’అని రిజిజు స్పష్టం చేశారు.
కాగా,మరోవైపు న్యాయ శాఖ బాధ్యతల నుంచి వైదొలిగిన రిజిజు ఇంతకాలం తనకు సహాయ, సహకారాలు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ‘‘ప్రధాని మోడీ మార్గదర్శకంలో కేంద్ర న్యాయ మంత్రిగా పనిచేయడం ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. దేశ పౌరులకు న్యాయ సేవలను సులభంగా అందించడంలో సహాయం చేసిన గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అన్ని హైకోర్టుల చీఫ్ జస్టిస్ లు, జడ్జ్ లు, న్యాయవాదులు, న్యాయాధికారులు అందరికీ ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోడీజీ విజన్ కు అనుగుణంగా ఎర్త్ సైన్స్ శాఖలోనూ అంతే ఉత్సాహంగా పనిచేస్తాను. వినయపూర్వకమైన బీజేపీ కార్యకర్తగా ఉంటాను’’ అని రిజిజు ప్రకటించారు. ఇది ఇలా ఉంటే రెండేళ్లుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఉన్న రిజిజును ఆ శాఖ నుంచి గురువారం తొలగించి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు ఆ బాధ్యతలు కట్టబెట్టడం తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ కిరణ్ రిజిజుకు ఎర్త్ సైన్సెస్ శాఖ బాధ్యతలు కేటాయించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement