Monday, April 29, 2024

Movie: ‘కిన్నెరసాని’ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్.. ఎప్పుడంటే..

క‌ళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన ‘కిన్నెరసానిస మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రీలీజ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ 5 యాప్ సొంతం చేసుకుంది. జూన్ 10వ తేదీన ఈ మూవీ నేరుగా ఓటిటిలో విడుదల చేయనున్నారు. రమణ తేజ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కిన్నెరసాని’ జీ5లో నేరుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. వేద అనే అమ్మాయి తన తండ్రి కోసం ఆరాతీయడం వంటి ఘ‌ట‌న‌ల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

అన్ శీతల్, కాశిష్ ఖాన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీలో రవీంద్ర విజయ్ విలన్‌గా నటించారు. మరో కీలక పాత్రలో మహతి బిక్షు నటించారు. రమణ తేజ ఈ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. సాయి తేజ దేహరాజ్ ఆత్రేయస ఈ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామ్ ప్రసాద్ నిర్మాతగా.. ఎస్సార్టీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై ‘కిన్నెరసాని’ చిత్రాన్ని తెరకెక్కించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement