Friday, April 26, 2024

బేర్‌ గ్రిల్స్‌ కొత్త ఎపిసోడ్‌లో కింగ్‌ కోహ్లీ!

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ త్వరలో ఓ టీవీ షోలో కనిపించనున్నాడు. బ్రిటన్‌ సాహసి బేర్‌ గ్రిల్స్‌ తన తర్వాతి ఎపిసోడ్‌ను కోహ్లీ తో ప్లాన్‌ చేసున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. బాలీవుడ్‌ హీరోయిన్‌ చోప్రాతో కూడా అడ్వెంచర్‌ ఎపిసోడ్‌ తీయాలనే ఆలోచనతో ఉన్నానని బేర్‌గ్రిల్స్‌ చెప్పాడు. ‘కోహ్లీ, ప్రియాంక చోప్రా ఇద్దరూ కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం. వీళ్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమనులున్నారు. ఆటతో, సినమాలతో పాపులర్‌ అయిన ఈ ఇద్దరితో త్వరలోనే కొత్త ఎపిసోడ్‌ తీయాలనుకుంటున్నా.

అయితే.. ఇప్పటివరకు కోహ్లీ, ప్రియాంక పాల్గొనేది? లేనిది? మేము వెల్లడించలేదు. ప్రస్తుతమైతే వాళ్లతో మా టీమ్‌ చర్చలు జరుపుతోంది. వాళ్లు ఓకే చెప్తారని నేను చాలా నమ్మకంతో ఉన్నా. ఈ సెలబ్రిటీల జీవితం గురించి మరింతగా తెలుసుకోడాన్ని నాతో పాటు ప్రతిఒక్కరు గొప్ప గౌరవంగా భావిస్తారు’ అని బేర్‌ గ్రిల్స్‌ తెలిపాడు. అతను గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్‌ హీరోలు రణ్‌వీర్‌ సింగ్‌, అక్షయ్‌ కుమార్‌తో అడ్వెంచర్‌ ట్రిప్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement