Wednesday, May 1, 2024

UP: విద్యార్థి కిడ్నాప్‌.. చావబాదిన హెడ్‌కానిస్టేబుల్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అవ‌మానీయ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసి హెడ్ కానిస్టేబుల్‌తో స‌హా మ‌రికొంత మంది అత‌డిని చిత‌క‌బాదారు. అంత‌టితో ఊరుకోకుండా అత‌డి నోట్లో మూత్ర‌విస‌ర్జ‌న చేశారు. కాన్పూరులో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనమైంది.

ఎంసీఏ విద్యార్థి ఆయుష్ ద్వివేది (23) తన స్నేహితుడితో కలిసి ఓ స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లిన సమయంలో కొందరు దుండగులు తుపాకి గురిపెట్టి అతడిని కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement