Sunday, April 28, 2024

Delhi : మ‌రోసారి ఈడీ విచార‌ణ‌కు కేజ్రీవాల్ గైర్హాజ‌రు..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఉండనున్నారు. ఈ మేరకు ఇవాళ ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఆయన గైర్హాజరు కానున్నారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ కేజ్రీవాల్ కు మూడు రోజుల క్రితం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు ఇప్పటివరకు ఐదుసార్లు నోటీసులు అందించారు. అయితే గత నాలుగు నెలలుగా ఈడీ ఇస్తున్న నోటీసులను పట్టించుకోని కేజ్రీవాల్ అక్రమంగా తనకు నోటీసులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు ఈడీ నోటీసులను ఆప్ లాయర్ల బృందం అధ్యయనం చేస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ కార్యాలయం ఎదుట ఇవాళ ధర్నాకు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement