Friday, May 3, 2024

హిమ‌పాతం కార‌ణంగా నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేష‌న్స్

ఈ నెల 22వ తేదీన చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. హిమాల‌య ప‌ర్వ‌త సానువుల్లో భారీగా మంచు కురుస్తున్న కారణంగా రిషికేశ్, హరిద్వార్‌లో కేదార్‌నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఎగువ గర్హ్వాల్ హిమాలయ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో యాత్రికుల భ‌ద్ర‌త దృష్ట్యా రిషికేశ్‌, హరిద్వార్‌లో కేదార్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 30వ తేదీ వరకు నిలిపివేశారు.

గర్హ్వాల్ డివిజన్ అదనపు కమిషనర్ (పరిపాలన), చార్‌ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తికూల‌ వాతావరణం, భారీ హిమపాతం దృష్ట్యా ఏప్రిల్ 30 వరకు రిషికేశ్, హరిద్వార్‌లో కేదార్‌నాథ్ యాత్ర కోసం యాత్రికుల నమోదును తాత్కాలికంగా నిలిపివేశామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement