Sunday, April 28, 2024

తెలంగాణ‌ ప‌థ‌కాలు దేశమంతా విస్తరించాలన్న‌దే కేసీఆర్ ల‌క్ష్యం : బాల్క సుమన్

మహారాష్ట్రలోని నాగపూర్ లో భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో చండీ హోమం అత్యంత ఘనంగా నిర్వహించారు. బుధవారం కార్యాలయంలో నిర్వహించిన వాస్తు, గణపతి, చండీ హోమాల్లో పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసన సభ్యులు బాల్క సుమన్ హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హోమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పై ఉండాలని, భారత దేశానికి కేసీఆర్ ప్రధానిగా కావాలని కోరుకున్నామన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ దేశమంతా విస్తరించాలని కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించారన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement