Wednesday, May 1, 2024

ఢిల్లీలో కవిత దీక్ష… ప్రారంభించనున్న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

న్యూఢిల్లీ: భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరశన దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉదయం 10 గంటలకు దీక్షను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు దీక్ష సీపీఐ కార్యదర్శి డీ రాజా దీక్షను ముగించనున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో కవిత దీక్షకు పూనుకున్నారు. ఎమ్మెల్సీ కవితతోపాటు ఈ దీక్షలో 500 మంది కూర్చోనున్నారు.. దీక్షకు దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. దేశంలోని మహిళా హక్కుల సంఘాలు, వివిధ పార్టీల నేతలు ఈ దీక్షకు హాజరుకానున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement