Sunday, April 28, 2024

Karnataka – మాజీ ముఖ్యమంత్రి విద్యుత్ చౌర్యం – కుమార స్వామి పై కేసు నమోదు

బెంగళూరు: విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్‌ వినియోగించిన కారణంగా కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై మంగళవారం కేసు నమోదైంది. దీపావళి సందర్భంగా బెంగళూరులోని తన నివాసాన్ని అలంకరించే క్రమంలో ఓ స్తంభం నుంచి అక్రమంగా తీగలను వేసినట్లు బెస్కాం (బెంగళూరు విద్యుత్తు సరఫరా సంస్థ) అధికారులు గుర్తించారు. ఈ సంఘటనపై మంగళవారం బెస్కాం ఏఈఈ ప్రశాంత్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో జయనగర పోలీసులు కుమారస్వామిపై కేసు నమోదు చేశారు

.ఈ సంఘటనపై కుమారస్వామి స్పందిస్తూ తన నివాసాన్ని అలంకరించే బాధ్యతను ఓ ప్రైవేటు డెకొరేటర్‌కు అప్పగించగా, కేవలం టెస్టింగ్‌ కోసమే బయట నుంచి విద్యుత్తు తీసుకున్నారని చెప్పారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని వివరించారు తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయం గుర్తించి ఇంట్లో మీటర్‌ నుంచి విద్యుత్తు వాడుకోవాలని సూచించినట్లు కుమారస్వామి చెప్పారు. ఇది అక్రమమని భావిస్తే అధికారులు తనకు నోటీసులు ఇచ్చి విచారణ చేపడితే జరిమానా కట్టేందుకు సిద్ధమని వివరణ ఇచ్చారు. దేశం, రాష్ట్రం మునిగిపోయేంత పని తానేమీ చేయలేదన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement