Thursday, May 9, 2024

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి – రూ.వెయ్యి కోట్లు ఆఫ‌ర్ చేసిన కేఏపాల్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి వెయ్యి కోట్ల రూపాయ‌ల ఆఫ‌ర్ ని ప్ర‌క‌టించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్..ఈ మేర‌కు పవన్ కల్యాణ్ కు బంపర్ ఆఫర్ ఇస్తూ తమ పార్టీలోకి ఆహ్వానం పలికారు. పవన్ తన సొంత పార్టీ జనసేనను వదిలిపెట్టి తమ పార్టీలో చేరితే… ఎంపీగానో, ఎమ్మెల్యేగానో గెలిపిస్తామని చెప్పారు. ఒకవేళ పవన్ ను గెలిపించలేకపోతే రూ. 1,000 కోట్ల నజరానా ఇస్తానని ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో పవన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ సొంతంగా పోటీ చేసినా, మరో పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా ఎన్నికల్లో గెలవలేర‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement