Monday, April 29, 2024

క‌న్నా వ్యాఖ్య‌లు రాజ‌కీయ దురుద్దేశ‌మే : ఎంపీ జీవీఎల్

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా ప్రకటించ‌డంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కన్నాకు బీజేపీలో సముచిత గౌరవం ఇచ్చినట్టు, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గంలో‌ చోటు కల్పించారని ఎంపీ అన్నారు. బయట పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా కన్నాకు కీలక పదవులు ఇచ్చారన్నారు. ఈ రోజు కన్నా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమే అని జీవీఎల్ అన్నారు. గతంలో కూడా సోమువీర్రాజు పై అనేక వ్యాఖ్యలు చేశారని, పార్టీలో సోము‌వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పార్టీ అధిష్టానానికి‌ చెప్పే చేశారన్నారు. సోము ఏకపక్షంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు. తనపై కూడా గతంలో, ఇప్పుడు కన్నా ఎక్కువ విమర్శలు చేశారన్నారు. తన పరిధిలో తాను పని‌ చేస్తున్నానని.. కన్నా విమర్శలపై తాను మాట్లాడబోనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement